
తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేయూత పథకం కింద కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 2026-27 వార్షిక బడ్జెట్లో రూ.233 కోట్లను కేటాయించడంతో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు



























































