AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌ తొలి సమీక్ష

‘పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలపై సుదీర్ఘ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యానికి సోమ‌వారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వ‌ల విస్త‌ర‌ణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు ప‌నుల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్షించారు.

అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర నూతన సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) వచ్చారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సెలవు ఉన్నప్పటికి సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నూతన సచివాలయానికి వచ్చారు. మొదట యాగశాలకు వెళ్లి… అక్కడ పూజల అనంతరం ఆరో అంతస్థులోని తన ఛాంబర్‌కు చేరుకున్నారు. తన కార్యాలయంలో సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖపై తొలి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలకు సంబంధించిన పనులపై సమీక్షిస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, వికారాబాద్‌కు వెళ్లే తాగునీటి కాల్వల నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు తాగు నీటి కోసం కృష్ణా జలాలను తరలించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ ఫైల్‌పై నిన్న సంతకం చేశారు కేసీఆర్. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఉదండాపూర్ జలాశయం నిర్మిస్తున్నారు… ఇక్కడి నుంచి రెండు కాల్వలు నిర్మించడం ద్వారా వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు తాగు నీటిని సరఫరా చేయనున్నారు. నిర్మాణ వ్యయం రూ. 5 వేల180 కోట్లుగా అంచనా వేశారు..

ఈ సమీక్ష సమావేశానికి జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, రామకృష్ణారావు, నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్లు సమీక్షలో పాల్గొన్నారు.

ANN TOP 10