పంజాగుట్టలో ఓ యువతి హల్చల్ సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద ఓ యువతి నానా హంగామా సృష్టించింది. రెండు గంటల పాటు న్యూసెన్స్ క్రియేట్ చేసింది. అర్ధరాత్రి 12 గంటలకు నుండి దాదాపు రెండు గంటల పాటు గొడవ చేసింది. తన లవర్ తనను వదిలిపెట్టి వెళ్లాడంటూ శ్మశానవాటికలో ఏడుపులు మొదలుపెట్టింది. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకుంటానంటూ కాసేపు బెదిరింపులకు దిగింది.
యువతి హల్చల్ చేస్తుండటంతో.. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువతికి నచ్చజెప్పి శ్మశానవాటిక నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమె వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తోన్నారు. పబ్లిక్లో న్యూసెన్స్ చేయడంపై యువతికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
అర్థరాత్రి యువతి హంగామా సృష్టించడంతో ఏమైందంటూ ఆమెను స్థానికులు ప్రశ్నించారు. తాాను ప్రేమించిన అబ్బాయి తనను వదిలేసి వెళ్లాడని, ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. యువతి ఆత్మహత్య చేసుకోకుండా స్థానికులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు చేరుకుని యువతిని తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.









