న్యూఢిల్లీ: దేశంలో గతకొన్ని రోజులుగా భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 78,342 కోవిడ్ పరీక్షలు చేయగా.. 7,178 మందికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడైంది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 44.9కోట్లు దాటింది. ఇక, కరోనాతో మరో 16మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 5,31,345 మంది మరణించారు.









