గవర్నర్కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ
ప్రకాశం జిల్లా, యర్రగొండపాళెంలో చంద్రబాబు పర్యటనలో వైసీపీ నేతలు రాళ్లదాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ చర్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. అలాగే చంద్రబాబుపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది. దీనిపై చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై టీడీపీ శ్రేణులే దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.









