రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరూ దొంగలేనని బీఆర్ఎస్ నేత కౌశిక్రెడ్డి అన్నారు. హుజూరాబాద్ బైపోల్లో రేవంత్ను ఈటల రూ. 25కోట్లకు కొన్నారు. ఆ లెక్కల్లో తేడా వచ్చి ఇప్పుడు బయట వేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు బైపోల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రూ. 25 కోట్లు అందాయని ఈటల వ్యాఖ్యానించినప్పుడు… ఆధారాలు చూపించాలని, ప్రమాణం చేస్తానని రేవంత్ సవాల్ విసిరారు. దీనిపై కౌశిక్ పైవిధంగా స్పందించారు.









