సొంత కార్యకర్తలకే భరోసా లేదని ఆవేదన
(మహా, జగిత్యాల):
కాంగ్రెస్ పార్టీలో ఉండలేనంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదని ఆయన అన్నారు. తాను ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేనని చెప్పారు.
‘నీకో దండం… నీ పార్టీకో దండం’ అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జీవన్రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేయగా… తాను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని, పార్టీ కోసం తన నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారంటూ ఫోన్ కట్ చేశారు.









