ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నారని అధికారవర్గాల సమాచారం. రిజర్వేషన్ వివరాల ఆధారంగా వివిధ స్టేషన్లలో ఎక్కిన, దిగాల్సిన ప్రయాణికులు మొత్తం 122 మంది ఉన్నారు. ఇందులో కొంతమంది క్షేమంగా ఉన్నట్లు తమ కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే, చాలా మంది వివరాలు మాత్రం తెలియరాలేదు. వారి ఫోన్లు కలవడంలేదని కొంతమంది, స్విచ్ఛాప్ అని వస్తోందని మరికొంతమంది చెప్పారు. దీంతో తమ వారికి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.
తెలుగువారి కోసం హెల్పలైన్ నంబర్లు
ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, రైల్వే శాఖ హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటుచేశాయి. తెలుగు వారి ఆచూకీ కోసం విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించారు.విశాఖపట్నం: 0891-2746330, 0891-2744619విజయనగరం: 0892-2221202, 0892-2221206శ్రీకాకుళం: 0894-2286213, 0894-2286245ఒడిశా హెల్ప్లైన్ నంబర్: 06782262286రైల్వే శాఖ హెల్ప్లైన్ నంబర్లు: హౌరా 033-26382217ఖరగ్పూర్: 8972073925బాలాసోర్: 8249591559చెన్నై: 044-25330952పశ్చిమబెంగాల్ హెల్ప్లైన్ నంబర్లు: 033-22143526, 033-22535185









