తొలి సినిమాతోనే స్టార్ డమ్ అందుకుంది ఖుషీ రవి. ఆమె నటించిన దియా చిత్రం ఎంత పెద్ద విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. 2020లో విడుదలైన ఈ సినిమాకు యూత్ లో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. డైరెక్టర్ కే.ఎస్. ఆశోఖ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి కృష్ణ చైతన్య నిర్మించారు. ఈ సినిమాకు అజనీస్ లోకనాథ్ సంగీతం అందించారు. కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాదు.. తెలుగువారిని సైతం ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.









