రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలు రేణుకకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తుతో రేణుకకు బెయిల్ లభించింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు రేణుకకు ఆదేశించింది. ఇదే కేసులో నిందితులు రమేష్, రాజేందర్ లకు కూడా బెయిల్ మంజూరైంది.
