హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ చెరువు గురించి తెలియని వారుండరు. ఈ చెరువులో చేపలు బాగా ఫేమస్. నిత్యం లోటస్ పాండ్ చెరువు చుట్టు ప్రక్కన ఉన్న వారు ఇక్కడ వాకింగ్ చేస్తూంటారు. అయితే.. ఇవాళ ఉదయం లోటస్ పాండ్ చెరువులో 3 వేలకుపైగా చేపలు మృతి చెందాయి. వేల సంఖ్యలో చనిపోయి నీళ్లపై చేపలు తేలాయి. దీంతో ఉదయం అక్కడికి వచ్చిన వాకర్లు..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పిసిబి అధికారులు.. ఫిషరీస్ అధికారులు… ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు.
