కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకొని సరూర్ నగర్ లో యువ సంఘర్షణ సభకు హాజరు కానున్నారు. ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రియాంక కేవలం గంటన్నర మాత్రమే పర్యటిస్తారని, సభలో యువ డిక్లరేషన్ ప్రకటిస్తారని నేతలు తెలిపారు.









