ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ముండ్లమూరులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి రెండు సెకండ్ల పాటు కంపించింది. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూపరిశోధన అధికారులు భూకంప తీవ్రత ఎలా ఉంది అనే వివరాలు వెల్లడించలేదు. స్వల్ప భూప్రకంపనలు కాబట్టి సునామీ వచ్చే అవకాశాలు లేవు.









