సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది ఏఐసీసీ ఇంచార్జీ మానిక్ రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యువసంఘర్షణ సభ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. ఒక్కసారిగా బీజేపీ మహిళా నేతలు ఆందోళనకు దిగారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామంటూ స్టేడియంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.పోలీసులు బీజేపీ మహిళ నేతలను అరెస్ట్ చేశారు.









