తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, సీనియర్ నాయకులు కలిసి సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మానిక్ రావ్ ఠాక్రే యువ సంఘర్షణ సభ లోగోను ఆవిష్కరించారు.కాగా ఈ నెల 8న జరగనున్న యువ సంఘర్షణ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.









