కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భజరంగ్ దళ్ ను బ్యాన్ చేయాలన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై.. బీజేపీ మండిపడుతుంది. హస్తం నేతలకు వ్యాఖ్యలను ఖండిస్తూ.. నేడు తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ లీడర్లకు వ్యతిరేకంగా..కాషాయ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయనున్నారు. కాంగ్రెస్ కార్యాలయాలు, ఆ పార్టీ శ్రేణుల ఇళ్లముందు బీజేపీ ఆందోళనలకు సిద్ధమైంది. హనుమాన్చాలీసా పఠనంతో నిరసన చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది.









