ఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యం సాధారణంగా ఉందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. పొత్తికడుపు ఎగువభాగంలో నొప్పి రావడంతో ఆదివారం రాత్రి కిషన్ రెడ్డిని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. డిశ్చార్జి చేయాలని వైద్యులు అనుకున్నప్పటికి పరిశీలనలో ఉంచామని ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి.









