AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం..

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతలోనే అర్ధరాత్రి దాటక మరోమారు వర్షం కుమ్మేసింది. మారేడుపల్లి మిలటరీ ఏరియా, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, బోరబండ, ఫిలింనగర్, బంజారాహిల్స్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా మూసాపేట, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

అర్ధరాత్రి దంచికొట్టిన వర్షానికి మారేడు పల్లి ప్రాంతంలోని మిలటరీ ఏరియాలో ఓ భారీ వృక్షం నేలకూలింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో రాత్రి నుండి AOC లో రాకపోకలు నిలిచిపోయాయి. అంత పెద్ద వృక్షం ఇళ్లపైన పడకుండా రోడ్డువైపు పడటంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డు పక్కన పార్క్‌చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది.

ANN TOP 10