నల్లగొండ జిల్లాలో ఆన్లైన్క్రికెట్బెట్టింగ్నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.12 కోట్ల నగదు, 2 కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిల్లా పోలీస్ఆఫీసులో ఎస్పీ కె.అపూర్వరావు తెలియజేశారు. మిర్యాలగూడ వన్టౌన్ పరిధిలోని మయూరినగర్ హౌసింగ్ బోర్డులో ఉన్న సాయిదత్త అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్303లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో వన్టౌన్ సీఐ రాఘవేందర్, ఎస్ఐ శివ తేజ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, కట్టంగూర్ ఎస్ఐ విజయ్ కుమార్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రవి, రహమాన్ రైడ్ చేశారు.
బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మిర్యాలగూడ మయూరినగర్కు చెందిన బంటు రాజేశ్, ఖమ్మం జిల్లా బోనకల్కు చెందిన కోల సాయికుమార్, రాచబంతి జీవన్కుమార్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన నోట్ల సత్యనారాయణ, ఖమ్మం జిల్లాకు చెందిన శాకమూరి ఉదయ్కుమార్, మిర్యాలగూడ గాంధీనగర్కు చెందిన బంటు సంతోష్, గంధం నవీన్కుమార్, బంటు వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా ప్రకాశ్నగర్కు చెందిన కొండవేటి రాజేశ్ఉన్నారు.









