AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ సంగతి కోర్టులో తేలుస్తా: రాజగోపాల్

రేవంత్ అడుగుపెడితే భాగ్యలక్ష్మీ వారి ఆలయం అపవిత్రమవుతుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ విమర్శించారు.రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.ఓటుకు నోటు కేసులో రేవంత్ అడ్డంగా దొరికిపోయారని అన్నారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్‎కి డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొనుకున్నారని ఆరోపించారు.తాను, ఈటల రాజేందర్ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లామని.. కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‎లో చేరారన్నారు.

రేవంత్‎కి బ్లాక్ మెయిలర్ అనే పేరుందని.. రేవంత్‎రెడ్డి పదవులను అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.మునుగోడులో తనను ఓడించేందుకు బీఆర్ఎస్‎తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు.రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని తనపై తప్పుడు ప్రచారం చేశారని.. ఆ ఆరోపణలను రుజువు చేయకపోతే రేవంత్ సంగతి కోర్టులో తేలుస్తానని చెప్పారు.ఎప్పటికైనా రేవంత్ జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.

ANN TOP 10