మహారాష్ట్ర పూణె జిల్లాలోని వనవడిలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్థి వేదాంత్(14) క్రికెట్ ఆడుతుండగా గుండెనొప్పితో కింద పడిపోయాడు. స్నేహితులు అతని తండ్రికి విషయం చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తీవ్రమైన గుండెపోటు కారణంగానే వేదాంత్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా గుండెపోట్ల ఘటనలు పెరిగిపోతున్నాయి.









