AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నా..

లోకేష్ పాదయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగం
యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ (Nara Lokesh)ను చూసి చాలా బాధ కలిగిందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి (Jc Prabhakar Reddy). రాష్ట్రం కోసం ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. లోకేష్ కాళ్ల బొబ్బలు పగిలాయని.. ఇదంతా చూసి తనకు కళ్లలో నుంచి నీళ్లు వచ్చాయన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగంతో కంటతడి పెట్టారు. లోకేష్ తల్లిదండ్రులు, భార్యకు నమస్కరిస్తున్నాను అన్నారు.

తన కుమారుడు అస్మిత్ రెడ్డి మూడు రోజులు పాదయాత్ర చేసి కాళ్లు నొప్పులు వచ్చాయని అన్నారని.. కానీ లోకేష్ మాత్రం ప్రజల కోసం వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారని ప్రశంసించారు. లోకేష్ ఒక కర్మజీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు. లోకేష్ పాదయాత్రలో సంగ సక్సెస్ అయ్యారని.. విష్ యూ అల్ గుడ్ లక్ అన్నారు జేసీ. కష్టమైనా ఫర్వాలేదని.. లోకేష్ పాదయాత్ర కొనసాగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. రివెంజ్ అనొద్దని.. అందర్నీ క్షమిద్దామని.. కొంతమంది అధికారులు ఉన్నారు.. వాళ్లను మాత్రం విడిచిపెట్టొద్దన్నారు ప్రభాకర్ రెడ్డి.

ANN TOP 10