- ఖమ్మంలో శ్రీలీల క్రేజ్
- మాంగళ్యమాల్ ప్రారంభోత్సవానికి హాజరు…
- ప్రారంభోత్సవానికి హాజరై అభినందించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, మహా : ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల ఖమ్మంలో శుక్రవారం సందడి చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మాంగళ్య 30వ శాఖను శ్రీలీల జ్యోతి ప్రజ్వలనం చేసి మాల్ను ప్రారంభించారు. అనంతరం మాల్లోని వివిధ విభాగాలను సందర్శించి, అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం నటి శ్రీలీల మాట్లాడుతూ.. ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉందని, వారి ఆశీర్వాదాలతో ఈ మాల్ మరింత విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపారం రంగంలో దశాబ్దాల అనుభవంతో నాణ్యమైన వస్త్రాలు అందిస్తూ మూడు రాష్ట్రాల ప్రజలకు విషెస్ సేవలందిస్తున్న మాంగళ్య యాజమాన్యం పి ఎస్ మూర్తి, కాసం నమశివాయ బ్రదర్స్ ను అభినందించారు. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే తమ విజయ రహస్యం అని పేర్కొన్నారు.
తమ స్వంత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్కు అనుగుణంగా డిజైన్ చేసి, వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నామని తెలిపారు .మాంగళ్య షాపింగ్ మాల్లో మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్స్, అలాగే వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేకమైన భారీ వెడ్డింగ్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని . ఈ మాల్ ప్రారంభంతో ఖమ్మం జిల్లా ప్రజలు ఇకపై పెళ్లి షాపింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ ప్రాంతంలోనే నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. మాంగళ్య ఒక సంపూర్ణ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గా ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్, రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 9–10 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనుండగా, భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్రానికి కూడా విస్తరించనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు విశాల్, వరుణ్, కార్తిక్, అరుణ్, పనీత్, సాయి కృష్ణ పాల్గొన్నారు.









