AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొమురం భీమ్‌కు సీఎం రేవంత్‌ నివాళులు

జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదంతో రాచరికం, దొరతనంపై పోరాడుతూ ఆదివాసీ గోండుల వీరత్వాన్ని చాటి ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన విప్లవవీరుడు కొమురం భీమ్‌ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే గురువారం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా సంస్కృత ఆదికవి, రామాయణ మహాకావ్య, రచయిత మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రామాయణాన్ని మహా కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నతలు మహర్షి వాల్మీకి అని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారిక సాంస్కృతిక కార్యక్రమంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కొమురం భీమ్, వాల్మీకి చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్, తదితరులు ఉన్నారు.

ANN TOP 10