AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లో చేరాలనుకున్నా.. కానీ వాళ్లు రేవంత్‌ను కలవనివ్వలేదు: బాబు మోహన్

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలంతా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బాట పట్టారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నేతలు భావించటమే అందుకు కారణం. బీఆర్ఎస్‌లోని మెయిన్ మెయిన్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం గమనార్హం. ఈ క్రమంలోనే.. సీనియర్ నేత, నటుడు బాబు మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారట.. కానీ అందులో ఉన్న కొందరు నేతలు కనీసం రేవంత్ రెడ్డిని కలిపించేందుకు కూడా ఇష్టపడలేదంటా. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు మోహన్ కీలక విషయాలు వెల్లడించారు.

అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్కసారి కలవాలనుకున్నట్టు బాబు మోహన్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాలని భావించినట్టు తెలిపారు. సీఎంకు ఒక్కసారి కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మంత్రులు సీతక్క, కొండా సురేఖను అడిగినట్టు చెప్పుకొచ్చారు. కేవలం కలిసి కంగ్రాట్స్ చెప్తానని.. పార్టీలో చేరాలనో, పదవుల కోసమో కాదని క్లారిటీగా చెప్పానన్నారు. కానీ ఇప్పటివరకు ఆయనను కల్పించలేదని తెలిపారు. అయితే.. మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచన కూడా వచ్చిందన్నారు. ఎందుకంటే.. వరంగల్‌లో 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.. చేరితే బాగుంటుందనుకున్నారు. కానీ కనీసం సీఎం రేవంత్ రెడ్డిని మామూలుగానే కల్పించలేదని.. ఇక విషయం ఎలా చెప్పాలంటూ చెప్పుకొచ్చారు.

నేను డైరెక్టుగా వెళ్లి గాంధీ భవన్‌కు వెళ్లి అందరిలా పార్టీలో చేరలేనుగా అన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి తెలిస్తే.. తనను కలవొచ్చుగా అనుకుంటారు.. కానీ తనను కలవనివ్వలేదన్న విషయం ఆయనకు తెలియదు అంటూ కీలక విషయాలు పంచుకున్నారు బాబు మోహన్.

ANN TOP 10