ఖమ్మం నగరంలో BRS శ్రేణులు దౌర్జన్యానికి దిగారు. మంత్రి పువ్వాడ అజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ యువకుడు చీకటి కార్తీక్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. కార్తీక్కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. BRS కార్యకర్తల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ లోపు 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తామని, త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామన్నారు.









