AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

ఆత్మహత్యకు పాల్పడిన యువతి
ప్రేమ పేరుతో మోసపోయి అమ్మాయులు, అబ్బాయిలు ఎంతో విలువైన తమ ప్రాణాలు క్షణికావేశంలో తీసేసుకుంటున్నారు. తాజాగా.. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఏడేళ్లు కలిసి తిరిగి పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ప్రియుడు మెుహం చాటేయటంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నవీపేట మండల కేంద్రానికి చెందిన హరిణి (25) అదే గ్రామానికి చెందిన అక్తర్‌ ప్రేమించుకున్నారు. ఏడేళ్ల క్రితం వీరి ప్రేమ చిగురించగా.. అప్పటి నుంచి చెట్టాపట్టాలేసుకొని తిరాగారు. అయితే ఇటీవల కాలంలో హరిణి పెళ్లి విషయమై అక్తర్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. తరుచూ ఏదో ఒక విషయం చెప్పి పెళ్లి విషయాన్ని అక్తర్ దాటవేసేవాడు.

రెండ్రోజుల క్రితం అక్తర్‌ను గట్టిగా నిలదీయగా.. అతడు పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. దీంతో హరిణి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆదివారం ( మే21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గది తలుపులు పెట్టి ఉండటాన్ని గమనించారు. పిలిచినా హరిణి పలకకపోటవంతో ఆందోళనతో తలుపులు పగులగొట్టారు. తమ కూతురు ఫ్యాన్‌కు వేలాడుతుండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఆమెను కిందకు దించి చూడగా… అప్పటికే ఆమె మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు నవీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ANN TOP 10