AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి నిరాశ..

ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించలేమన్న ధర్మాసనం..
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చెక్కెదురైంది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది సుప్రీం ధర్మాసనం. బెయిల్ పిటిషన్‌ను విచారించలేమని వెకేషన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఇదిలాఉంటే.. ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్.. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. బెయిల్ పిటిషన్‌ను ఇప్పుడు విచారించలేమని తేల్చి చెప్పింది.

ANN TOP 10