కర్ణాటక రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. సీఎం కుర్చి కోసం నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. సీఎం బరిలో ఉన్న పీసీసీ చీఫ్ డికె శివకుమార్ కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. బయలుదేరే ముందు పార్టీ హైకమాండ్ తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు కోరారు. ఇందు కోసం సీఎం పదవి కోసం హైకమాండ్తో చర్చలు కొనసాగిస్తోంది. ఢిల్లీకి బయలుదేరే ముందు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేకు ముందుగానే హామీ ఇచ్చానని, ఇచ్చిన హామీని నెరవేర్చానిన అన్నారు.









