AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెజిమెంటల్ బజార్‌లో అగ్నిప్రమాదం…. కొత్తకోణం వెలుగులోకి

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రేజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వుడ్ ఫర్నీచర్ ఉండడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డారు. మంటలు ఇంటి మొత్తానికి వ్యాపించి దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో అంతా చీకటిమయంగా మారింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ అగ్నిప్రమాద ఘటనలో తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.1.64 కోట్ల నగదుతో పాటు భారీగా బంగారం, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో లేడు. పని మీద వెళే ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బిజినెస్ కాంట్రాక్ట్ పనులు కూడా శ్రీనివాస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ANN TOP 10