బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు నువ్వా? నేనా? అన్నట్లు హోరాహోరి పోరు సాగుతోంది. 224 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాథమిక ఫలితాలు(Early Karnataka Leads) వెల్లడి కాగా అందులో 106 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.(BJP, Congress Chase Each Other) 82 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
జేడీఎస్ 21 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.రెండు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు సాగుతోంది.









