AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెదిరింపులు ఆపి చర్చలు జరపండి..

బెదిరింపులు ఆపి చర్చలు జరిపి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల, ఓపిఎస్ల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసేయడం అంటే నైజాం పాలనలో ఉన్నామా రాచరిక పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని అన్నారు. బెదిరింపులు ఆపి చర్చలు జరిపి ప్రభుత్వం సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.

వెట్టి చాకిరి చేస్తున్నారు
ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు హామీ ఇచ్చి మాట తప్పడం శోచనీయం కాదన్నారు. పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిది కాదని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు వెట్టి చాకిరి చేస్తున్నారని అన్నారు. ఆత్మగౌరవ పోరాటాన్ని గౌరవించి పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10