వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సీపీ ఏవీ రంగనాథ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు, హోంగార్డులకు మొత్తం 300 మందికి కూలింగ్ గ్లాసెస్ అందజేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా ఎండలో ఉంటూ విధులు నిర్వహిస్తారని.. వారికి కళ్ల ఆరోగ్యం కోసం కూలింగ్ గ్లాసెస్ అందజేస్తున్నామని సీపీ తెలిపారు.









