సికింద్రాబాద్ బేగంపేటపోలీసు స్టేషన్ పరిధిలో ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. బేగంపేటలోని చీకోటి గార్డెన్ వద్ద ఇవాళ ఉదయం సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఛత్తీస్గఢ్కు చెందిన దేవేందర్ కుమార్గా గుర్తించారు. సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ లడ్డా నివాసం వద్ద దేవేందర్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారమే దేవేందర్ కుమార్ ఆత్మహత్యకు కారణంగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దేవేందర్ ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉందా ఉన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అతడి ఫోన్ రికవరీ చేసుకొని ఆందులోని సమాచారం ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.









