AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బందీపూర్ టైగర్‌ రిజర్వును సందర్శించిన నరేంద్ర మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు, కర్ణాటక పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌లో సఫారీ ట్రిప్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీని ప్రధాని సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా మోదీ నయా లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

దీంతో పాటు ప్రధాని తమిళనాడు ప్రాంతంలోని మదులై ఫారెస్ట్‌ వెళ్లారు. ఇక్కడ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీలో కనిపించిన ఏనుగులను ప్రధాని చూశారు.

ANN TOP 10