AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజకీయాల నుంచి రిటైర్ అయిన తర్వాత నేను చేసే పనులు ఆవే: అమిత్ షా..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన రాజకీయ రిటైర్మెంట్ అనంతరం చేపట్టబోయే కార్యకలాపాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత తన శేష జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక, వ్యవసాయ రంగాలకు అంకితం చేస్తానని ఆయన ప్రకటించారు.

 

రాజకీయ జీవితం ముగిశాక, తాను వేదాలు, ఉపనిషత్తులను లోతుగా అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు అమిత్ షా తెలిపారు. దీనితో పాటు, స్వయంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకంపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

 

రసాయనిక ఎరువులతో సాగు చేయడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని ఆయన అన్నారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల వ్యక్తిగతంగా తనకు ఎంతో ప్రయోజనం చేకూరిందని అమిత్ షా వివరించారు. రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరిగా ఉన్న అమిత్ షా, తన భవిష్యత్ ప్రణాళికల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10