ఇక సినిమాలు వదిలేస్తానని డైరెక్టర్ సుకుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన ఆయన.. ఈవెంట్ లో ‘మీరు ఒకవేళ ‘ధోప్’ అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? అని అడిగితే, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నానని అన్నారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందుల్లో పడటం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది.
ఇవన్నీ అల్లు అర్జున్పై ఎంత ప్రభావం చూపించాయనేది తెలియదు, కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం వీటి వల్ల మానసికంగా కుంగిపోయారని అర్థమవుతుంది. రేసెంట్ గా ‘పుష్ప 2’ సక్సెస్ మీట్లో, మహిళ మృతి గురించి మాట్లాడుతూ సుకుమార్ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటనతో అందరూ షాక్ అవుతున్నారు. యూఎస్లో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్లో సుకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమాలోని ‘ధోప్’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో, యాంకర్ సుమ సుకుమార్ ను.. మీరు ఒకవేళ ‘ధోప్’ (వదిలిపెట్టడం అని అర్థం) అని అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు అని అడిగితే.. సుక్కు ఏకంగా ‘సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా’ అని చెప్పారు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాకయ్యాడు. అనంతరం సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని ‘అలా చేయరులే’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల మీడియా అంతటా వైరల్ అవుతోంది.
Papam ra SUKKU 😢
Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK— Negan (@Negan_000) December 23, 2024