AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టులు మృతి

మళ్లీ దద్దరిల్లిన దండకారణ్యం

దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది.. తుపాకుల మోతలతో రక్తమోడింది. పచ్చని అటవీప్రాంతం ఎరుపెక్కింది. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్‌ గఢ్‌ అబూజ్‌ మడ్‌ అడవిప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు.

భీకర కాల్పులు..
మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో బస్తర్‌ పరిధిలో 4 జిల్లాల(నారాయణపూర్, దంతెవాడ, జగదల్‌పుర్, కొండగావ్‌) భద్రతా బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. అనంతరం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య తెల్లవారుజాము 3 గంటల సమయంలో భీకర కాల్పులు ప్రారంభమయ్యాయి. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఇందులో పాల్గొన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు..
యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్‌లో భాగంగా అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.. గతనెల లోనూ భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యాయి. ఈ ఏడాదిలో మార్చి నుంచి ఇప్పటివరకు దాదాపు ఏడు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. 200 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

గత అక్టోబర్‌ నెలలో..
చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ– నారాయణపూర్‌ సరిహద్దులోని అబూజ్‌మాఢ్‌ అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఏకంగా 38మంది మావోయిస్టులు హతమవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా రికార్డ్‌లకెక్కింది. ఇటీవల జరిగిన ములుగు ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. ఇలా వరుస ఎన్‌కౌంటర్లతో అటవీ ప్రాంతాల్లో హైటెన్షన్‌ నెలకొంది.

ANN TOP 10