AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేదింట ‘గృహజ్యోతి’ వెలుగులు.. రేవంత్‌ ఆసక్తికర ట్వీట్‌

ఒక్క హైదరాబాద్‌ లోనే 10.52 లక్షల మందికి లబ్ధి

సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఇందిరమ్మ పాలన
సత్ఫలితాలను ఇస్తున్న ప్రజాప్రభుత్వ సంకల్పం

పేదల ఇంట విద్యుత్‌ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వం  ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం సత్ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గృహజ్యోతి పథకం కింద కేవలం హైదరాబాద్‌ లోనే 10.52 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని సీఎం చెప్పారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు. సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌ గా ఇందిరమ్మ పాలన నిలుస్తోందని సీఎం వివరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు.

పేదలపై కరెంట్‌ బిల్లు భారం తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ ను వినియోగించే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్‌ అందిస్తోంది. దీంతో ఆయా కుటుంబాలకు కరెంట్‌ బిల్లు చెల్లించే అవసరం తప్పింది. ఆమేరకు కుటుంబాలపై భారం తగ్గింది. ఈ పథకంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

 

ANN TOP 10