AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర.. దాడి వెనుక ఎవరున్నారో గుర్తిస్తాం.. ఎవరినీ వదలం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై లగచర్లలో జరిగిన దాడి ఘటన వెనుక ఎవరు ఉన్నారో గుర్తించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి ఘటనల ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దాడి ఘటనకు సంబంధించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు.

రైతుల పేరుతో కొంతమంది గులాబీ ముసుగు వేసుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో బయటకు రావాల్సి ఉందన్నారు. వికారాబాద్‌ ఘటన వెనుక ఉన్నది ఎవరో త్వరలో తేలుస్తామన్నారు. ప్రజలకు మంచి చేద్దామని తాము భావిస్తే బద్నాం చేయాలనుకోవడం దారుణమన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10