AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 33 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 33 మంది మరణించారు. వీరిలో 21 మంది మహిళలే ఉన్నారు. మరో 80 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 42,500 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. లక్ష మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

ANN TOP 10