AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజాసింగ్ హత్యకు కుట్ర.. హైదరాబాద్ లో కలకలం!

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేందుకు కుట్ర జరిగిందన్న వార్తలు రావడంతో హైదరాబాద్ లో కలకలం రేగింది. ఈ రోజు రాజాసింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో వారిని పట్టుకున్న స్థానికులు మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించిన పోలీసులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నారు.

అయితే.. ఈ ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజాసింగ్ ను హత్య చేసేందుకే ఈ ఇద్దరు వచ్చారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసు విచారణలో ఏం తేలుతుందనే అంశం ఉత్కంఠగా మారింది.

ANN TOP 10