AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘హైడ్రా’కు హైకోర్ట్‌ బ్రేక్‌.. దుర్గం చెరువు పరిసరాల్లో కూల్చివేతలపై స్టే

నివాసితులకు భారీ ఊరట

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్‌ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలను లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్ట్‌ పేర్కొంది.

ప్రొటెక్షన్‌ కమిటీ ఎదుట హాజరుకావాలి..
అక్టోబర్‌ 4న లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఎదుట దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్ట్‌ తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్‌ 4 నుంచి ఆరు వారాల లోపు తుది నోటిఫికేషన్‌∙జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట దక్కినట్టు అయ్యింది.

మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
మరోవైపు హైదరాబాద్‌ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూకట్‌పల్లిలోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జో¯Œ పరిధిలో నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.. ఇవాళ మాదాపూర్‌లో కూల్చివేతలు కొనసాగిస్తోంది. కావూరి హిల్స్‌ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్‌ అకాడమీపై కొంతకాలంగా కావూరి హిల్స్‌ అసోసియేషన్‌ ఫిర్యాదులు చేసింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్‌ అకాడమీ నిర్మాణాలను తొలగించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10