AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీధి కుక్క దాడిలో 16 మందికి గాయాలు

హైదరాబాద్‌ బాలానగర్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. వినాయక్‌నగర్‌ కాలనీలో 16 మందిపై దాడికి పాల్పడిరది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఓ వీధి కుక్క ఎగబడి దాడి చేసింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా మ్నెత్తం 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాలనీ వాసులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో కూకట్‌ పల్లి జోన్‌ డాగ్‌ స్క్వాడ్‌ బృందం అక్కడికి చేరుకొని కుక్కను బంధించారు.

అంబర్‌పేట ఘటన తర్వాత జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలను బంధించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు, మార్గదర్శకాలు రూపొందించారు. అయితే వీధి కుక్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. వేసవి సమీపిస్తుండటంతో ఆహారం, నీరు దొరక్క కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తాయని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు, ఒంటరిగా వెళ్లేవారు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ANN TOP 10