AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

తెలంగాణ భవన్‌ లో నేడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేటీవ్, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు.. బీఆర్ఎస్ కార్యచరణతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ కార్యచరణను ప్రకటించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, ఒక వేళ అరెస్టు చేస్తే చేపట్టబోయే ప్రణాళికలపై చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రజల్లోకి ఏ నినాదంతో వెళ్లాలనేదే ప్రధాన ఎజెండాగా సమావేశంలో సుధీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. కేంద్ర విధానాలను ప్రజాక్షేత్రంలో ఎలా ఎండగట్టాలనే అంశాన్ని కేసీఆర్ కార్యకర్తలకు వివరించే అవకాశం ఉంది.

ANN TOP 10