AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోణీ కొట్టిన కంగారూలు.. లంకకు హ్యాట్రిక్ ఓటమి

వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన కంగారూలు.. సోమవారం లక్నో వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించారు. తొలుత లంకను 209 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్‌.. ఆ తర్వాత విజయలక్ష్యాన్ని 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌ (51 బంతుల్లో52 , 9 ఫోర్లు)తో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ (58 బంతుల్లో 58, 5 ఫోర్లు, 1 సిక్సర్‌), మార్నస్‌ లబూషేన్‌ (60 బంతుల్లో 40, 2 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 31 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. ఈ మెగాటోర్నీలో ఆసీస్‌కు ఇదే తొలి విజయం కాగా లంకకు హ్యాట్రిక్‌ ఓటమి.

ANN TOP 10