శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కలకలం రేపింది. ఈ- మెయల్ ద్వారా బెదిరింపులు వచ్చేసరికి అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమనాన్ని హైజాక్ చేశాము అంటూ ఓ అగంతకుము మెయిల్ వచ్చేసరికి అధికారుల్లో కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపేసి తనిఖీలు నిర్వహించారు. విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్కు తరలించారు.
అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ అది ఫేక్ మెయిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ అది ఫేక్ మెయిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.