స్కిల్ డెవలప్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు వెళ్లాయి. ఇక, చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రం అంతటా బంద్ కు పిలుపునిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.









