AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో పెళ్లి.. అంతలోనే..

పెళ్లి ముహూర్తానికి సమయం దగ్గర పడింది. వివాహానికి వచ్చిన వారితో పెళ్లింట సందడి నెలకొంది. బాజాభజంత్రీలు, బంధువుల హడావుడితో వరుడి ఇల్లు కళకళలాడుతోంది. అంతలోనే ఉహించని పరిమాణం చోటు చేసుకుంది. సంతోషం అలుముకున్న పెళ్లింట విషాదం నెలకొంది. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడి తండ్రి హఠాన్మరణం చెందాడు.

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన కూసరి గంగారాం, రాజేశ్వరి దంపతుల కుమారుడు ప్రశాంత్‌కు జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చమైంది. ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లికి కొన్ని గంటల సమయం ఉందనగా.. కల్యాణ మండపానికి వరుడిని తీసుకెళ్లేందుకు పెళ్లి కూతురు బంధువులు కోరుట్లలోని పెళ్లి కుమారుడి ఇంటికి వచ్చారు.

ఇంతలో వరుడి తండ్రి గంగారాం కుర్చీలో తాను కూర్చున్నచోటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందోనని ఆందోళన చెందిన బంధువులు అతడికి సపర్యలు చేశారు. అనంతరం వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాసేపట్లో కూమారుడి పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే వరుడి తండ్రి మృతి చెందటంతో పెళ్లింట విషాదం నెలకొంది.

మృతుడు గంగారాం అల్లుడు రెండు నెలల కిందట గుండెపోటుతో మృతి చెందగా… అప్పటి నుంచి ఆయన మనోవేదనకు గురయ్యాడని బంధువులు తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే కుటుంబంలోని ఇద్దరు అకాల మరణం చెందటంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనతో పెళ్లింట విషాదం అలుముకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10