AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ సర్కార్‌కు షాక్‌

ఎమ్మెల్యేల ఎర కేసు..
స్టేకు సుప్రీంకోర్టు విముఖత

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. ఎమ్మెల్యేల ఎర వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుముఖత చూపలేదు. కనీసం విచారణ పూర్తయ్యేంతవరకూ ఎవరినీ అరెస్ట్‌ చేయవద్దని సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్ధనపై కూడా సుప్రీం కోర్టు స్పందించలేదు. సీబీఐను తాము కంట్రోల్‌ చేయలేమని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కేసు సీబీఐ చేతికి వెళ్తే ఉపయోగం ఉండదని, ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా… పక్కదారి పడుతుందని ఈనెల 7, 8 తేదీల్లో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, సిద్ధార్థ లుత్రాలు ప్రత్యేకంగా వాదనలు వినిపించారు. వెంటనే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని న్యాయస్ధానాన్ని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది.

ANN TOP 10